More

    చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించిన వైసీపీ ఎమ్మెల్యే

    వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి సంగం మండలంలోని జంగాలకండ్రికలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ వారిని మనం అభినందించాలని అన్నారు. ఆయనకున్న పాటి జ్ఞానం బీజేపీ వాళ్లకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చనిపోతే, అదే కుటుంబం నుంచి ఎవరైనా పోటీలోకి దిగితే అక్కడ తమ అభ్యర్థిని నిలపబోమన్న సంప్రదాయాన్ని చంద్రబాబు పాటిస్తూ వస్తున్నారని, ఇందుకు మనం ఆయనను అభినందించాలని అన్నారు. ఆ మాత్రం జ్ఞానం బీజేపీ వాళ్లకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతంరెడ్డి మరణం తర్వాత బీజేపీ వారు విలేకరుల సమావేశాలు పెట్టి మరీ ఆయనను పొగిడారని, మనసున్న మారాజంటూ కీర్తించారని.. ఇప్పుడు వారే ఇక్కడ పోటీలోకి దిగడం దారుణమైన విషయమని నల్లపురెడ్డి అన్నారు.

    Trending Stories

    Related Stories