ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు ఉపఎన్నికల్లో అధికార వైసీపీ భారీ విజయం అందుకుంది. రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హఠాన్మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి, బీజేపీ నుంచి భరత్కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
వైసీపీ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్రెడ్డి తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్లారు. మొత్తం 20 రౌండ్లు ఉండగా. మొదటి రౌండ్ నుంచి ప్రతి రౌండ్లో తన ఆధిక్యాన్ని అంతకంతకు పెంచుకుంటూ వెళ్లారు. వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల మెజార్టీతో ఘనవిజయాన్ని సాధించారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ కి 19,316 ఓట్లు వచ్చాయి.
ఈ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి 82,888 ఓట్ల భారీ మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. ఉప ఎన్నికలో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ డిపాజిట్ కోల్పోయారు. ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. పోస్టల్ బాలెట్లో 205 ఓట్లకు గానూ వైఎస్సార్సీపీకి 167 ఓట్లు వచ్చాయి.