ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని యువతకు గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబర్ రెండవ వారంలో, ప్రభుత్వం ఉచిత సెల్ఫోన్లు మరియు టాబ్లెట్లను అందించడం ప్రారంభించనుంది. DG శక్తి అనే పోర్టల్ ను యువత కోసమే స్థాపించబడింది. దీనిని త్వరలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించనున్నారు. అదే వెబ్పేజీలో విద్యార్థులకు స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్లను ఎలా పొందాలనే దానితో పాటు భవిష్యత్తు అధ్యయనాల కోసం కంటెంట్ను అందిస్తుంది. అంతేకాకుండా, స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్ల గురించి విద్యార్థులకు వారి మొబైల్ నంబర్, ఇ-మెయిల్ లకు రోజూ తెలియజేస్తారు. ప్రభుత్వ విద్యార్థులు ఉచిత సెల్ఫోన్లు మరియు టాబ్లెట్లను స్వీకరించడానికి ప్రత్యేకంగా నమోదు చేసుకోవలసిన అవసరం లేదు.
రిజిస్ట్రేషన్ దగ్గర నుండి స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్ల డెలివరీ వరకు మొత్తం ప్రక్రియ పూర్తిగా ఉచితం. కళాశాలలు విద్యార్థుల గురించిన సమాచారాన్ని విశ్వవిద్యాలయానికి అందిస్తాయి. విద్యార్థుల డేటాను యూనివర్సిటీ ద్వారానే ప్రభుత్వం స్వీకరిస్తుంది. నవంబర్ 29 వరకు, దాదాపు 27 లక్షల మంది విద్యార్థుల డేటా అప్లోడ్ చేయబడింది. మిగిలిన విద్యార్థులకు కూడా వీటిని అందించేందుకు డేటా ఫీడింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. డిసెంబర్ రెండో వారం నుండి అర్హులైన వారికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం స్మార్ట్ఫోన్లు మరియు టాబ్లెట్లను అందించనుంది.