More

    కరోనా నుండి కోలుకున్న రిషబ్..!

    ఇండియ‌న్ టీమ్ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ క‌రోనా నుంచి కోలుకున్నాడు. అతడు తిరిగి టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న క‌రోనా బారిన ప‌డిన పంత్ ప‌ది రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్నాడు. ఆ త‌ర్వాత నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో నెగ‌టివ్‌గా తేల‌డంతో అత‌డు టీమ్‌ బ‌యో బ‌బుల్‌లోకి వెళ్లాడు. ఈ విష‌యాన్ని బీసీసీఐ తెలిపింది. ఆగ‌స్ట్ 4న ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం పంత్ అందుబాటులో ఉండ‌నున్నాడు. పంత్ టీమ్‌తో చేరినా.. మ‌రో వికెట్ కీప‌ర్ వృద్ధిమాన్ సాహాతోపాటు అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ ఇంకా ఐసోలేష‌న్‌లోనే ఉన్నారు. ఇద్ద‌రు వికెట్ కీప‌ర్లు ఐసోలేష‌న్‌లో ఉండటంతో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా కేఎల్ రాహుల్‌కు ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. రాహుల్ ప్రాక్టీస్ మ్యాచ్ సెంచ‌రీతో అదరగొట్టాడు.

    పంత్ మరియు శిక్షణా సహాయకుడు దయానంద్ గారానీ ఇద్దరూ కోవిడ్ -19 కు పాజిటివ్ వచ్చినట్లు జూలై 15 న బీసీసీఐ ప్రకటించింది. ఆ సమయంలో యువ వికెట్ కీపర్ ఐసోలేషన్ లో ఉండి ఎనిమిదవ రోజు అని బోర్డు తెలిపింది. పంత్ పాజిటివ్ వచ్చినప్పటి నుండి ఐసోలేషన్ లో ఉన్నారు. వృద్ధిమాన్ సాహాతోపాటు అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, బౌలింగ్ కోచ్ భ‌ర‌త్ అరుణ్ లు జూలై 24 న ఐసోలేషన్ నుండి బయటకు వస్తారని భావిస్తున్నారు.

    Related Stories