భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నిక సంఘం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జులై 5న ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. జులై 5 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కానుండగా, జులై 19 వరకు నామినేషన్ల దాఖలుకు అనుమతించనున్నారు. జులై 20న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు జులై 22 వరకు గడువు విధించారు. పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. పోలింగ్ను ఆగస్టు 6న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే అదే రోజుల ఓట్ల లెక్కింపును నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించనుంది.