2021 సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫైనల్ రిజల్ట్స్ ను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ ఏడాది ఆలిండియా టాప్ ర్యాంకర్ గా శ్రుతి శర్మ నిలిచారు. రెండో ర్యాంకును అంకిత అగర్వాల్, మూడో ర్యాంకును గామిని సింగ్లా సాధించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ రౌండ్స్ తర్వాత యూపీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది. మెయిన్స్ ఫలితాలను మార్చి 17న యూపీఎస్సీ ప్రకటించింది. ఆ తర్వాత ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకు ఇంటర్వ్యూలు (పర్సనాలిటీ టెస్ట్) నిర్వహించింది. మొత్తం 685 మందిని సివిల్ సర్వీసెస్ అపాయింట్ మెంట్ కోసం యూపీఎస్సీ సిఫారసు చేసింది. వీరిలో 244 మంది జనరల్, 73 మంది ఈడబ్ల్యూఎస్, 203 మంది ఓబీసీ, 105 మంది ఎస్సీ, 60 మంది ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారు.
సివిల్స్ టాప్ 10 ర్యాంకర్లు వీరే:
శ్రుతి శర్మ
అంకిత అగర్వాల్
గామిని సింగ్లా
ఐశ్వర్య వర్మ
ఉత్కర్ష్ ద్వివేది
యక్ష్ చౌదరి
సమ్యక్ ఎస్ జైన్
ఇషిత రాథీ
ప్రీతమ్ కుమార్
హర్ కీరత్ సింగ్ రంధావా
UPSC సివిల్ సర్వీసెస్ తుది ఫలితాలు- 2021ని ఎలా తనిఖీ చేయాలంటే:
UPSC సివిల్ సర్వీసెస్ 2021 తుది ఫలితాలను తనిఖీ చేయడానికి కింద చెప్పిన దశలను అనుసరించాలి:
అధికారిక వెబ్సైట్ — upsc.gov.inకి లాగిన్ చేయండి
హోమ్పేజీలో, “UPSC Civil Services Result 2021 -Final Result” పై క్లిక్ చేయండి.
ఎంచుకున్న అభ్యర్థుల వివరాలతో కూడిన PDF ఫైల్ కనిపిస్తుంది
దీన్ని డౌన్లోడ్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్ అవుట్ తీసుకోండి.