కన్హయ్య లాల్ను మతోన్మాదులు నరికి చంపిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటన.. తర్వాత నిందితులిద్దరూ ఇస్లాం మతాన్ని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకున్నట్లు వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ వీడియోలో నిందితులు.. మా దేవుడిని అగౌరవపరిచిన నిందితులకు గుణపాఠం చెప్పాలనే నా లక్ష్యం నెరవేరిందని చెప్పుకొచ్చారు.
నిందితులను విచారించిన తర్వాత ఉదయపూర్ ఏటీఎస్ హత్యకు ఉపయోగించిన రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS), ఉదయపూర్ బృందం నిందితులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ వద్ద రెండు రక్తపు మరకలతో కూడిన ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఉదయ్పూర్లోని సపెటియా ప్రాంతంలోని నిందితుడి సహాయకుడి కార్యాలయం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కన్హియా లాల్ను చంపిన తర్వాత, సపెటియాలోని షోయబ్ కార్యాలయానికి వెళ్లి వీడియో రికార్డ్ చేసినట్లు అధికారులకు చెప్పారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు జూన్ 17న మరో వీడియో కూడా రికార్డ్ చేశారు.