తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారి నైవేద్య విరామ సమయంలో జాతీయ మీడియా సలహాదారుడు దేవులపల్లి అమర్, ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్లు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.