ఎంపీ బండి సంజయ్ పై తప్పుడు పోస్ట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు

0
612

తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ పై ట్విట్టర్ లో తప్పుడు పోస్ట్ పెట్టిన వ్యక్తిపై కేసు నమోదైంది. సచిన్. కె. రెడ్డి అనే వ్యక్తిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీతో పాటు ఆయన బామ్మర్ది భూ కబ్జాకు పాల్పడ్డారని పోస్ట్ చేయడంపై స్పందించిన బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయిన్ పల్లి ప్రవీణ్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సచిన్ తన ట్వీట్ లో ఎంపీ బండి సంజయ్, అతని బామ్మర్ది శ్రీనివాస్ కలిసి రేకుర్తి శివారులోని భూమిని కబ్జా చేసినట్టు నిరాధార ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది బండి సంజయ్ పరువుకు భంగం వాటిల్లేలా చేయడమే కాకుండా, బీజేపీ కార్యకర్తలను అవమానించే విధంగా ఉందని ఫిర్యాదు చేశారు. సచిన్ కె. రెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థించారు. ట్విట్టర్ లో పెట్టిన పోస్టును కంప్లైంట్ తో జత చేశారు.