కపిల్ శర్మ.. ఎంతో పాపులర్ కమెడియన్..! కొన్ని కొన్ని సార్లు కామెడీ కోసం ఇతరులను అవహేళన చేస్తూ ఉండడం అతడికి అలవాటే. ఇటీవల కంగనా రనౌత్ కపిల్ శర్మ షోకు వెళ్లిన సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఎగతాళి చేస్తూ వ్యాఖ్యలు చేశాడు కపిల్. ఒకప్పటి సినిమాలు కొన్ని అలా ఉండేవేమో.. ఇప్పుడు చాలా మారిపోయింది అంటూ కపిల్ శర్మకు కంగనా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ టీమ్ మరో వివాదంలో ఇరుక్కుంది.
ఈ కార్యక్రమంపై ఒక లాయర్ కేసు వేశాడు. మధ్యప్రదేశ్లోని శివపురికి చెందిన లాయర్ ‘ది కపిల్ శర్మ షో’ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందుకు కారణం ఇటీవల ప్రదర్శించిన ఒక ఎపిసోడ్లో స్టేజిపై కోర్టురూమ్ సెట్ వేశారని, దానిలో నటులు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారని ఆ లాయర్ చెప్పారు. ఇది కోర్టును అగౌరవపరచడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఈ కార్యక్రమ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేసినట్లు సదరు లాయర్ చెప్పారు.
ది కపిల్ శర్మ షోకు సంబంధించిన ఓ ఎపిసోడ్ జనవరి 2020 లో ప్రసారం చేయబడిందని. ఏప్రిల్ 2021 లో రీ టెలికాస్ట్ చేశారు. ఆ ఎపిసోడ్ లో కోర్టు విచారణలో పాల్గొన్నవారు మద్యం సేవించినట్లు కనిపించే దృశ్యాన్ని చూపించారు. మధ్యప్రదేశ్కు చెందిన న్యాయవాది సురేష్ ధకడ్కి ఇది నచ్చలేదు. అతను మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా కోర్టులో షో నిర్మాతలపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని పిటీషన్ వేశారు. ‘సోనీ టీవీలో వస్తున్న కపిల్ శర్మ షో చాలా అసంబద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో మహిళలపై చాలా అసభ్య కామెంట్లు చేస్తారు. ఒక ఎపిసోడ్లో స్టేజిపై కోర్టురూమ్ సెట్ వేశారు. ఆ సెట్లో కొందరు నటులు బహిరంగంగానే మద్యం తాగుతూ కనిపించారు. ఇది కోర్టును అగౌరవపరచడమే. అందుకే సెక్షన్ 356/3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశాను. ఇలాంటి వాటిని ఖచ్చితంగా ఆపాల్సిందే’ నని పిటిషన్ వేసిన న్యాయవాది సురేష్ చెప్పారు. కోర్టు గది సన్నివేశంలో, సహనటుడు మద్యం బాటిల్తో వేదికపైకి వచ్చి దానిని రుచి చూడమని ఇతర వ్యక్తులను ప్రోత్సహిస్తాడు అని న్యాయవాది విలేకరులతో సంభాషిస్తూ చెప్పారు. ఈ దృశ్యం కోర్టు గౌరవాన్ని ఉల్లంఘిస్తుందని అన్నారు. షో యాంకర్ కపిల్ శర్మ మరియు సోనీ టీవీ డైరెక్టర్ MP సింగ్పై IT చట్టం మరియు ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేయబడిందని.. ఈ కేసు అక్టోబర్ 1, 2021 న విచారణకు వస్తుందని సదరు న్యాయవాది మరింత సమాచారాన్ని ఇచ్చారు. అయితే, ఈ ఆరోపణలపై కపిల్ శర్మ ఇంకా స్పందించలేదు.