More

    ఆ ప్రభావంతో తెలంగాణ‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వానలు

    తెలంగాణ‌లో నేటి నుంచి నాలుగు రోజుల పాటు వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. క్యుములోనింబస్ ప్ర‌భావంతో తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో కుంభవృష్టి పడుతుందని.. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక దక్షిణ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొన‌సాగుతోందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. కర్ణాటకపై 3.1 కిలో మీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. తెలంగాణ‌లోని పలు ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉపరితల ద్రోణి గాలులతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరేడు డిగ్రీలు తక్కువగా ఉంటుందని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వివ‌రించారు.

    అండమాన్ నికోబార్ దీవుల దగ్గర నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో కేరళ ను తాకే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 5 నుంచి జూన్ 10లోపు తెలంగాణలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఏపీలో రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

    Trending Stories

    Related Stories