తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సోమవారం నుంచి ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఇక రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 2 నుంచి 6 వరకు, రూ.500 రుసుముతో 8 నుంచి 12 వరకు, 1000 రుసుముతో 14 నుంచి 17 వరకు, రూ.2000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఫస్టియర్, సెకండియర్ జనరల్ కోర్సుల విద్యార్థులు రూ.500, సైన్స్, వొకేషనల్ విద్యార్థులు రూ.710 ఫీజుగా చెల్లించాలని అధికారులు సూచించారు. ఈ సంవత్సరం 100 శాతం సిలబస్ అమలవుతుందని, పాతపద్ధతిలోనే పరీక్షలను నిర్వహిస్తామని ఇప్పటికే ఇంటర్మీడియేట్ బోర్డు స్పష్టం చేసింది. హాజరు మినహాయింపు పథకం కింద విద్యార్థులు రూ.500 ఫీజు కట్టి పరీక్షలు రాయొచ్చు. వారంతా ఈ నెల 14 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలిపింది.