More

    తెలంగాణకి చెందిన జవాన్ మిస్సింగ్.. ఆచూకీ తెలిస్తే ఈ నెంబర్స్ కు కాల్ చేయండి

    తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ ఆర్మీ జవాన్ వారం రోజులుగా కనిపించడం లేదు. పంజాబ్ రాష్ట్రంలో విధులకు వెళ్తున్న సమయంలో అతడి ఫోన్ స్విచాఫ్ రావడం మొదలైంది. అంతేకాకుండా ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతూ ఉన్నారు. ఆర్మీ (జవాన్) గన్నర్ కనిపించకుండా పోవడంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది. తెలంగాణకు చెందిన సాయి కిరణ్ రెడ్డి ఎక్కడ ఉన్నా.. క్షేమంగా ఉండాలని, క్షేమ సమాచారాన్ని ఈ క్రింది నెంబర్లకు 93814 95986, 95052 49282 ఫోన్ చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

    తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బోకురి సాయి కిరణ్ రెడ్డి ఆర్మీలో పని చేస్తున్నాడు. పటెల్ రెడ్డి కుమారుడు సాయి కిరణ్ రెడ్డి ఆర్మీలో చేరాడు. పంజాబ్ రాష్ట్రంలోనీ ఫరీద్ కోట్ ప్రాంతంలో గన్నర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గత ఇరవై రోజుల క్రితం సెలవుల్లో తన స్వగ్రామం పోతిరేడ్డిపల్లికి వచ్చినట్లు తెలిపారు. సెలవులు పూర్తయ్యాక అనంతరం డిసెంబర్ 7న విధులు నిర్వర్తించడం కోసం డిసెంబర్ 5న పయనమయ్యాడు. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్ళాడు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత వీడియో కాల్‌లో మాట్లాడారని సోదరుడు సోదరుడు భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లిన సాయి కిరణ్ తర్వాత రోజు నుంచి కంటిన్యూగా ఫోన్ స్విచ్చాఫ్ వస్తుందన్నారు. ఇప్పటి వరకు అతన్నుంచి ఎలాంటి ఫోన్ రాలేదని తెలుస్తోంది.

    సాయి కిరణ్ రెడ్డి మిస్సింగ్ పై చేర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. జీరో ఎఫ్ఐఆర్ చేసిన చర్యలు పోలీసులు ఈ కేసును ఢిల్లీ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆర్మీ జవాన్ గన్నర్ సాయికిరణ్ రెడ్డి మిస్సింగ్ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

    Trending Stories

    Related Stories