తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలో స్రవంతి అనే యువతీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సదరు యువతి సల్మాన్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. అయితే పెళ్లి అయ్యి ఆరు నెలలు కూడా అవ్వకుండానే ఆమె ఆత్మహత్య చేసుకుంది. తాను ప్రేమించిన ముస్లిం బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోడానికి ఆమె మతం కూడా మారి.. పేరు కూడా మార్చుకుంది. అయితే ఆమె తాజాగా ఆత్మహత్య చేసుకుంది. షేక్ సమీరాగా పేరు మార్చుకుని మరీ సల్మాన్ ను పెళ్లి చేసుకుంది. మే 24న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సల్మాన్ కుటుంబ సభ్యుల కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని స్రవంతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు.
ఈ ఘటనపై దేవుని పల్లి పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు. స్రవంతి అత్తామామలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్ కాలనీ లో నివాసముండే 19 సంవత్సరాల స్రవంతి, గుమస్తా కాలనీకి చెందిన సల్మాన్ ప్రేమించుకున్నారు. 2021 జనవరి 7న వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. స్రవంతి తన మతాన్ని కూడా మార్చుకుంది. షేక్ సమీరాగా పేరును మార్చుకుంది. పెళ్లి అయిన రెండు నెలలకు భర్తతో కలిసి స్రవంతి వేరు కాపురం పెట్టింది. అయితే మే 24న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని భోరుమన్నారు. తమ కూతురు ఒంటిపై గాయాలున్నాయని.. అత్త, మామ, భర్త తమ కుమార్తెను కొట్టి చంపారని అనుమానం వ్యక్తం చేశారు. సల్మాన్ ను, అతడి కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.