తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం వెల్లడైంది. ఢిల్లీ వేదికగా గవర్నర్ తమిళిసై.. తెలంగాణ సర్కార్పై పరోక్షంగా విమర్శలు కురిపించారు.
రాష్ట్రంలో వరదలపై రాజకీయం చేయడం మంచిది కాదని గవర్నర్ తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెలంగాణకు వచ్చాయని వెల్లడించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిధులకు సంబంధించిన వివరాలు ఇచ్చారని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజలతోనే ఉంటానన్న ఆమె… నైతిక బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించానన్నారు. ఈ క్రమంలోనే వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదించానని వెల్లడించారు. కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ.. దేశానికి రాష్ట్రపతి కావడం కేవలం భారత్లోనే సాధ్యమైందని చెప్పారు. మహిళా రాష్ట్రపతి కింద మహిళా గవర్నర్గా పని చేయడం సంతోషంగా ఉందన్నారు.
సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని స్పష్టం చేశారు. రాజ్భవన్లో సీఎం కేసీఆర్ కలిసిన తర్వాత కూడా ప్రొటోకాల్లో మార్పులేదని చెప్పారు. వరదల సమయంలో కలెక్టర్ కూడా రాలేదని అసహనం వ్యక్తం చేశారు. తమ మధ్య సంబంధాల్లో స్టేటస్ కో నే ఉందన్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లతో తాను పోల్చుకోనని… గవర్నర్ను కాబట్టి రాజ్భవన్కే పరిమితం కానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండటమే తన లక్ష్యమన్నారు. తనకు తోచిన రీతిలో వారికి సాయం అందిస్తానని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ గవర్నర్ హోదాలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి తమిళిసై హాజరయ్యారు.