టీఆర్ఎస్కు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ కొనేందుకు ప్రయత్నించారని ఆరోపణలు చేస్తోంది టీఆర్ఎస్. ఈ ఘటనలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలతో నిన్న రాత్రి ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. దీనిపై సీఎం కేసీఆర్ ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. కుట్రను బయటపెట్టిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు తదితరులతో ముఖ్యమంత్రి కేసీఆర్ గత రాత్రి ప్రగతి భవన్లో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ఆపరేషన్ ఆకర్ష్’ కుట్రను బయటపెట్టిన నలుగురు ఎమ్మెల్యేలను సీఎం అభినందించారు.
మొయినాబాద్ అజీజ్ నగర్లోని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫాంహౌస్లో వారితో బేరసారాలు నిర్వహించారు. పార్టీ మారితే డబ్బు, కాంట్రాక్టులు, పదవులు ఇస్తామని ప్రలోభపెట్టారు. సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఢిల్లీలోని ఫరీదాబాద్ ఆలయానికి చెందిన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, సింహయాజి, నందకుమార్లను అరెస్ట్ చేశారు.