తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు

డబ్బుల కోసం తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్శర్మ ఏప్రిల్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ యూట్యూబ్ చానల్ అధినేత తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్)ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.30 లక్షలు కావాలని మల్లన్న తనను బెదిరిస్తున్నాడని, ఇవ్వకుంటే తన చానల్లో తప్పుడు కథనాలు ప్రచారం చేసి పేరు చెడగొడతానని బెదిరించాడని లక్ష్మీకాంత్శర్మ తన ఫిర్యాదులో చెప్పారు.
మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేశాడని జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్శర్మ చేసిన ఫిర్యాదు మేరకు ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడని, ఇవ్వకపోతే తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేసి పేరు చెడగొడతానని బెదిరించాడని లక్ష్మీకాంత్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన చిలకలగూడ పోలీసులు ఇప్పటికే తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. శుక్రవారం రాత్రి ఉన్నట్టుండి మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న చిలకలగూడ పోలీసులు ఇప్పటికే మల్లన్నకు రెండుసార్లు నోటీసులు ఇచ్చి విచారణ కూడా చేపట్టారు. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా మల్లన్నను అరెస్ట్ చేశారు. మల్లన్నను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
ఈ కేసు విషయంలో తొలుత ఆగస్టు 3న చిలకలగూడ పోలీస్స్టేషన్లో విచారించిన పోలీసులు.. ఆగస్టు 8 న మరోసారి విచారణకు హాజరుకావాలని మల్లన్నకు సూచించారు. అయితే, తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు పేర్కొంటూ తన లాయర్ ద్వారా సమాచారం పంపిన ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రకటించారు. శనివారం ఉదయం ఆయనను కోర్టులో హాజరు పరచనున్నారు.