రాజధాని అంశంపై రెఫరెండానికి సిద్ధమా?: అర్.శ్రీనివాసులరెడ్డి

0
720

వైఎస్ఆర్‎సీపీ నేతలకు దమ్మూ ధైర్యం ఉంటే మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాలన్నారు టీడీపీ పోలిట్‎బ్యూరో సభ్యుడు అర్.శ్రీనివాసులరెడ్డి. రాయలసీమకు అన్యాయం చేసే విధంగా పరిపాలన రాజధానిని వైజాగ్‎కు తరలించాలని ప్రయత్నం చేస్తూ, రాయలసీమ అభివృద్ధి కోసం జాయింట్ యాక్షన్ కమిటీ వేస్తున్నట్లు ఎమ్మెల్యే గడికొట శ్రీకాంత్‎రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్ఆర్‎సీపీ మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు సిద్ధమైతే.. టీడీపీ అమరావతి రాజధాని నినాదంతో ఎన్నికలకు సిద్ధమని ప్రకటించారు. మూడు రాజధానుల పేరుతో వైఎస్.జగన్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 × four =