ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన పలాస మండలం సుమ్మాదేవి జాతీయ రహదారిపై జరిగింది. బొలెరో వాహనంలో ఏఆర్ కానిస్టేబుళ్లు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు ఎస్కార్టుగా బొలెరో వాహనంలో వెళ్లి వస్తుండగా ఆ ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా బొలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో ప్రమాదం జరిగింది.