డేరా సచ్ఛా సౌధా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో ఆ సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్కు హర్యానాలోని పంచకులలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. మరో నలుగురికీ ఇదే శిక్ష వేసింది. గుర్మీత్కు రూ.31 లక్షలు, మిగతా వారికి రూ.50 వేల జరిమానా విధించింది. రంజిత్ హత్య 2002లో జరిగింది. డేరాలో గుర్మీత్ మహిళలను ఎలా వేధిస్తున్నారన్నదానిపై అప్పట్లో ఓ లేఖ బయటకు వచ్చింది. రంజిత్ ఈ విషయాన్ని బయట పెట్టాడనే అనుమానంతో ఆయనను గుర్మీత్ హత్య చేయించారు.
2002 జులై 10 నాటి హత్య కేసులో ఈ తీర్పు వచ్చింది. 2002లో డేరా సచ్చా సౌధలో తన అనుచరుడైన రంజీత్ సింగ్ హత్యకు గురయ్యాడు. రంజీత్ సింగ్ కుమారుడు జగ్షీర్ సింగ్ ఫిర్యాదు మేరకు 2003 డిసెంబర్ 3న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసును పంచకులలోని సీబీఐ కోర్టు విచారించింది. డేరా సచ్చా సౌదాలోనే రంజిత్ సింగ్ 2002 జులై 10న హత్యకు గురయ్యారు. రంజిత్ హత్యకు డేరా బాబా సహా జస్బీర్ సింగ్, సబ్దీల్ సింగ్, కృష్ణ లాల్, ఇందర్ సైన్లు కుట్ర పన్నినట్టు న్యాయస్థానం తేల్చింది.
డేరాలోని మహిళలను సెక్స్ బానిసలుగా చేసుకుని గుర్మీత్ రామ్ రహీమ్ చేస్తున్న అరాచకాలను బయట ప్రపంచానికి తెలియజెప్పడానికి అజ్ఞాత వ్యక్తి పేరుతో లేఖ రాసినట్టు రంజిత్ సింగ్ను అనుమానించాడు డేరా బాబా.. ఇదే అతడి హత్యకు కారణమైందని సీబీఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. ఇదే లేఖను సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతి హైలైట్ చేశారు. ఆయన కూడా హత్యకు గురయ్యారు. జర్నలిస్ట్ హత్య కేసులోనూ ఇప్పటికే డేరా బాబాను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆశ్రమంలో ఇద్దరు శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన కేసులో డేరాబాబా ప్రస్తుతం 20 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. పంచకులలోని సీబీఐ ప్రత్యేక కోర్టు 2017లో అతడిని దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. రామచంద్ర ఛత్రపతి అనే జర్నలిస్టు హత్య కేసులోనూ కోర్టు అతడిని 2019లో దోషిగా ప్రకటించింది. బుర్జ్ జవహర్ సింగ్ వాలా గురుద్వారా నుంచి గురు గ్రంథ్ సాహిబ్ గ్రంథం దొంగతనం కేసులోనూ డేరా బాబా నిందితుడిగా ఉన్నాడు.