ఉత్తరప్రదేశ్తో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్-ఫైనల్లో మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడు అజేయంగా 220 పరుగులు చేయడంతో పాటూ.. జట్టుకు భారీ స్కోరును అందించాడు. మహారాష్ట్ర జట్టు యాభై ఓవర్లలో 330 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో శివ సింగ్ బౌలింగ్లో 43 పరుగులు చేశాడు. 49వ ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ వరుసగా ఏడు సిక్సర్లు బాదాడు. ఓవర్లోని ఐదవ బంతి నో-బాల్ వేయగా.. ఫ్రీ-హిట్ కూడా సిక్సర్ కొట్టాడు రుతురాజ్ గైక్వాడ్.. ఆ ఓవర్లో 43 పరుగులు వచ్చాయి. ఒకే ఓవర్ లో ఏకంగా 42 పరుగులు కొట్టాడు.
ఈ మ్యాచ్ లో గైక్వాడ్ డబుల్ సెంచరీని అందుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్(159 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్సర్లతో 220 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్లో రుతురాజ్ ఏకంగా 16 సిక్స్లు బాదాడు. రుతురాజ్ డబుల్ సెంచరీ సాధించగా.. అంకిత్ బావ్నే(37), అజిమ్ కాజీ(37) పరుగులతో రాణించారు. మహరాష్ట్ర నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 330 పరుగులు చేసింది.