జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక మహిళ, ఆమె కుమార్తె సహా ముగ్గురు మృతి చెందారు. మరో 17 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, జమ్మూ-పఠాన్కోట్ హైవేపై నానకే చౌక్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సును మరో బస్సు ఓవర్టేక్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను పంజాబ్లోని బటాలాకు చెందిన మంగి దేవి (36), ఆమె 14 ఏళ్ల కుమార్తె తానియా, రాజ్పూర్కు చెందిన కస్తూరి లాల్ (58)గా గుర్తించారు. ఒక బస్సు సహరన్పూర్కు వెళ్తుండగా, మరొకటి కథువా జిల్లాకు వెళ్తోంది. ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, దోడా, సాంబాలో జరిగిన రోడ్డు ప్రమాదం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాన్నారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.లక్ష, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు సాంబా జిల్లా యంత్రాంగం ప్రకటించింది. అలాగే స్వల్ప గాయాలకు రూ.10,000. పరిష్కారాన్ని ప్రకటించారు.