తన వెంట ఉన్న వాళ్లెవరో చెప్పిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

0
626

కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నలుగురు వ్యక్తులు మాత్రమే తన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారు. వాళ్లు తప్ప మిగతా వారంతా తన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారని.. పార్టీలో అన్ని నిర్ణయాలు అందరినీ అడిగే తీసుకుంటామని, ఫలితం తేడాగా వస్తే మాత్రం అధ్యక్షుడే విఫలమయ్యారనడం సరికాదని అన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడినయ్యాక 30 మందికిపైగా పార్టీలో చేరారని, పార్టీ నుంచి వెళ్లిపోయింది ముగ్గురు నాయకులే అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ట్రస్టుకు సంబంధించి కోట్లాది రూపాయలను మర్రి శశిధర్‌రెడ్డి స్వాహా చేశారని, వాటి లెక్కలు అడిగినందుకే ఆయన బీజేపీలో చేరారని ఆరోపించారు. డిసెంబరు మొదటి వారంలోగా పార్టీని ప్రక్షాళన చేసి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్తవారిని నియమించనున్నట్లు తెలిపారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఈడీ విచారణను ఖండిస్తూ వేలాది మంది పార్టీ కార్యకరలు ధర్నాలు చేసినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.