More

    మద్యం షాపుల్లోనూ రిజర్వేషన్లు.. త్వరలో బార్లు, రెస్టారెంట్లలోనూ

    కొద్దిరోజుల కిందట మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ కులస్థులు, ఎస్సీలు, ఎస్టీలకు ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. గౌడ కులస్థులకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) సోమేశ్‌ కుమార్‌ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. వీటి ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు. త్వరలో జరగబోయే మద్యం దుకాణాల టెండర్ల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2021-23 వరకు ఈ రిజర్వేషన్లు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.

    ఇకపై బార్లు, రెస్టారెంట్లలోనూ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గౌడ, ఎస్సీ, ఎస్టీలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసమే మద్యం షాపుల్లో వారికి ప్రభుత్వం 15 శాతం, 10 శాతం, 5 శాతం చొప్పున రిజర్వేషన్లను కల్పించిందని చెప్పారు. బార్ అండ్ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లను ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, దీనిపై పరిశీలన చేస్తామన్నారని తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. జిల్లాలవారీగా రిజర్వేషన్లను కల్పిస్తామని, నిష్పక్షపాతంగా కేటాయింపులు జరుపుతామని తెలిపారు. దేశంలో విప్లవాత్మక మార్పులను కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. విద్యతో పాటు బీసీల ఎదుగుదలకు ఎన్నో చేస్తున్నారని అన్నారు.

    Trending Stories

    Related Stories