వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రిమాండ్ పొడిగింపు

0
743

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. అనంతబాబు రిమాండ్ నేటితో ముగియగా, పోలీసులు అతడిని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు అనంతబాబుకు మరో 15 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది. గత మే నెల 23వ తేదీ నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న అనంతబాబు రెండుసార్లు బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా, కోర్టు తిరస్కరించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో కాకినాడ పోలీసుల విచారణ సరిగాలేదంటూ ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర (ఏపీసీఎల్ఏ) మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించింది. ఏపీసీఎల్ఏ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.