అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజుల నుండి విశాఖ, అనకాపల్లి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో జలాశయాలు నిండుకుండలా మారాయి. తాండవ రైవాడ రిజర్వాయర్ వరద నీరు గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.