ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని నియామిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోసాని ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.