జార్ఖండ్ రాష్ట్రంలో పెట్రోల్ ధరలను రూ.25 తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం నాడు ప్రకటించారు. పెట్రోల్ ధరలలో ఈ ఉపశమనం రాష్ట్రంలోని ద్విచక్ర వాహనదారులు మాత్రమే పొందగలరని తెలుస్తోంది. అది కూడా 10 లీటర్ల వరకూ ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.25 తగ్గించనున్నట్టు ప్రకటించారు. అయితే, ద్విచక్ర వాహనాల వారికే ఈ సౌకర్యం వర్తించనుంది. హేమంత్ సోరెన్ ఓ ట్వీట్లో ప్రభుత్వ నిర్ణయాన్ని తెలిపారు. “పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి, పేద మరియు మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు పెట్రోల్పై లీటరుకు ₹ 25 ఉపశమనం ఇవ్వనుంది. 26 జనవరి 2022 నుండి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది” అని జార్ఖండ్ CMO ట్వీట్ చేసింది.
పెరుగుతున్న పెట్రో ధరలు మధ్యతరగతి, పేదలపై ప్రభావం చూపుతున్నాయని.. రాష్ట్రంలో పెట్రో ధరల కారణంగా పేద ప్రజలు తమ మోటార్సైకిల్ను నడపలేకపోతున్నారని సీఎం అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు అనునిత్యం పెరిగిపోతున్నాయి. పేదలు, మధ్యతరగతి వర్గంపై ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఆ కారణంగానే రాష్ట్రంలో ద్విచక్ర వాహనదారులందరికీ ఉపశమనం కల్గించేందుకు లీటర్ రూ.25 చొప్పున పెట్రోల్ ధరలు తగ్గించాలని నిర్ణయించాం. 2022 జనవరి 26 నుంచి ఇది అమల్లోకి వస్తుందని అన్నారు. ద్విచక్ర వాహనంలో నింపిన ప్రతి లీటరుకు 25 రూపాయల నగదు ప్రజల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుందని జార్ఖండ్ ప్రభుత్వం చెబుతోంది. 10 లీటర్ల పెట్రోల్ వరకూ 25 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయనున్నారు.