More

    ఉర్దూలోకి సామవేదం.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ అద్భుత ప్రసంగం..!

    సామవేదాన్ని ఉర్దూలో ఆవిష్కరించిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. వెళ్లే మార్గం వేరు కావచ్చు కానీ.. అందరిదీ ఒకే గమ్యమని ఆయన అన్నారు. ఎర్ర కోట వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించడానికి ప్రజలు వివిధ మార్గాలలో వెళుతూ ఉంటారని అన్నారు.

    హిందూమతం పునాది గ్రంథాలుగా పరిగణించబడే నాలుగు వేదాలలో ఒకటైన సామవేదం ఉర్దూ అనువాదాన్ని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని మోహన్ భగవత్ అన్నారు. వేరు వేరు మతాలకు చెందిన వ్యక్తులు.. వేరు వేరు పూజా విధానాలను కలిగి ఉండవచ్చు, కానీ గ్రహించాల్సిన సత్యం.. చేరుకోవాల్సిన లక్ష్యం ఒక్కటేనని అన్నారు. పూజలు ఏ మతంలోనైనా ఒక భాగమని, అయితే ప్రతి మతం అంతిమ లక్ష్యం ఆధ్యాత్మిక సత్యాన్ని సాధించడమేనని.. దాన్ని ప్రతి ఒక్కరూ అందుకోడానికి ప్రయత్నించాలని అన్నారు. ప్రస్తుత పోరాట యుగంలో ప్రపంచం దీనిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రకరకాలుగా పూజలు చేసినా ఆనందంగా ఉండవచ్చని, అయితే అందరి పూజలను గౌరవిస్తూ సత్యాన్ని ఆరాధించాలని అన్నారు. ఇదే జ్ఞానానికి పరమావధి అని గుర్తుంచుకోవాలన్నారు. వేద సూత్రాలు వాక్యాల లాంటివని.. వాటి పూర్తి అర్థాన్ని అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తుల వంటి ఇతర కూర్పులు కూడా అవసరమని మోహన్ భగవత్ అన్నారు. వారి ప్రాథమిక సందేశాలను అర్థం చేసుకునేలా వాటిని అధ్యయనం చేయాలని అన్నారు. ప్రజలు ఎటువంటి కారణం లేకుండా ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారని.. ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయాలని, సామవేదం శాశ్వతమైన సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

    ఐతే చిత్ర దర్శకుడు ఇక్బాల్ దుర్రానీ సామవేదాన్ని ఉర్దూలోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని మదర్సాలలో బోధించాలని ఆయన చెప్పారు. విద్యాసంస్థల ప్రార్థనల్లో కూడా సామవేదాన్ని చేర్చాలని అన్నారు. మదర్సాలలో కూడా బోధించాలని, అక్కడ చదివే పిల్లలు ఏది తప్పో, ఏది ఒప్పో నిర్ణయించుకునేలా చేయాలన్నారు.

    Trending Stories

    Related Stories