కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వేల.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

0
727

వచ్చే నెల 5 నుంచి ఏపీలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కాబోతుండడంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది జులై 5న ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం.. వచ్చే ఏడాది ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుంది. ఒకటి నుంచి తొమ్మిదవ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలు ఏప్రిల్ 27తో ముగుస్తాయంటూ.. రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి అకాడెమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ప్రతి తరగతికి వారానికి 48 పీరియడ్లు ఉంటాయి. ప్రతి ఉపాధ్యాయుడు వారానికి 38 నుంచి 39 పీరియడ్లు బోధించాల్సి ఉంటుంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు క్లాసులు ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం 3.30 గంటల నుంచి 4 గంటల వరకు ఆటలు లేదా రివిజన్ క్లాసులు ఉంటాయి. ప్రీహైస్కూల్, హైస్కూల్, హైస్కూల్ ప్లస్ పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆటలు లేదా రివిజన్ క్లాసులు ఉంటాయి. వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్ డే’ ఉంటుంది.

2022-23 విద్యా సంవత్సరంలో పాఠశాలలు 220 రోజులు పని చేస్తాయి. వారంలో ఒక రోజు ‘నో బ్యాగ్‌ డే’ ఉంటుందని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్టీ) విడుదల చేసిన కేలండర్ లో స్పష్టం చేసారు. సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 6వరకు దసరా సెలవులుగా ఖరారు చేసారు. డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటి వరకు క్రిస్మస్ సెలవులుగా.. క్రిస్టియన్‌ మైనారిటీ పాఠశాలలకు దసరా సెలవులు అక్టోబరు 1 నుంచి 6వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 16 వరకు ఉంటాయని కేలండర్ లో తెలిపారు.