More

    కొత్త నిబంధనలతో మీ ఓల్డ్ వెహికల్స్ బోలెడు ప్రాబ్లమ్స్

    ఈ ప్రతిపాదనల ప్రకారం, వాహన యజమాని దేశంలోని ఏ స్క్రాపింగ్ కేంద్రానికైనా తన పాత వాహనాన్ని తీసుకెళ్లి ఉచిత సేవలు పొందవచ్చు. ఆ యజమాని తన స్క్రాపింగ్ సర్టిఫికెట్ను ఎవరికైనా బదిలీ చేసి కొత్త వాహనం కొనుక్కోవచ్చు. దీని కోసం ప్రోత్సాహాలను కూడా పొందవచ్చు. పాత కాలుష్య వాహనాలను తొలగించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనలను ప్రకటించినట్లు భావించవచ్చు.

    మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన వాహనం ఉంటే గనక మీరు చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాల్సిందే. సాధారణంగా 15 ఏళ్లు దాటిన ప్రైవేటు వాహనాల విషయంలో వాటి యజమానులు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఆర్సీ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా, వాణిజ్య వాహనాల విషయంలో, అవి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ తప్పనిసరి. ఫిట్నెట్ పరీక్షలో పాస్ అయిన తర్వాతే ఆ వాహనానికి రెన్యువల్ సర్టిఫికెట్ అందజేస్తారు. అయితే, వాహనాలను స్క్రాప్ చేయడానికి, మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాల ఏర్పాటుకు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనల ప్రకారం, వాహన యజమాని దేశంలోని ఏ స్క్రాపింగ్ కేంద్రానికైనా తన పాత వాహనాన్ని తీసుకెళ్లి ఉచిత సేవలు పొందవచ్చు. ఆ యజమాని తన స్క్రాపింగ్ సర్టిఫికెట్ను ఎవరికైనా బదిలీ చేసి కొత్త వాహనం కొనుక్కోవచ్చు. దీని కోసం ప్రోత్సాహాలను కూడా పొందవచ్చు. పాత కాలుష్య వాహనాలను తొలగించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ కొత్త ప్రతిపాదనలను ప్రకటించినట్లు భావించవచ్చు.

    మరోవైపు 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్సీ రెన్యువల్, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై, 15 ఏళ్లు పైబడిన వాహనాల ఆర్సీ రెన్యువల్కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక, ఆర్సీ రెన్యువల్ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్లో ఆలస్యం చేస్తే, నెలకు రూ .300 నుండి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది.

    ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ రెన్యువల్ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ .50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్సీ రెన్యువల్ ఫీజును రూ.300 నుంచి రూ .1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్ కోసం రూ .12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు కంటే దాదాపు 21 రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. కాగా, 2021 అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. వాహన స్క్రాపేజ్ విధానాన్ని రూపొందించే ప్రణాళికలో భాగంగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ పెంపును ప్రతిపాదించింది.

    Trending Stories

    Related Stories