More

    భారత్ లోకి అడుగుపెట్టిన ఒమిక్రాన్ వేరియంట్.. ఎక్కడ మొదట గుర్తించారంటే

    కరోనా కొత్త మ్యుటేషన్ ఒమిక్రాన్ భారత్ లో అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికాలో తొలుత వెలుగు చూసిన ఈ వేరియంట్ ప్రపంచ దేశాలకు పాకిపోయింది. తాజాగా ఈ వేరియంట్ కేసులు భారత్ లో సైతం వెలుగుచూశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మన దేశంలో రెండు కేసులను గుర్తించినట్టు తెలిపింది. ఈ రెండు కేసులను కర్ణాటకలోనే గుర్తించినట్టు పేర్కొంది. 44 ఏళ్లు, 66 ఏళ్ల ఇద్దరు వ్యక్తుల్లో ఈ వేరియంట్ ను గుర్తించనట్టు తెలిపింది.

    దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయినట్లు జీనోమ్ స్వీక్వెనింగ్ పరీక్షలో తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ స్పష్టం చేశారు. ఒమిక్రాన్‌ బారినపడ్డ వారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడేనని చెప్పుకొచ్చారు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో వీరిద్దరిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన చెప్పారు. ఈ వేరియెంట్‌ మనదేశంలో మరింత ప్రబలే ప్రమాదం ఉందని.. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 5 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని.. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ వైరస్ 29 దేశాలకు విస్తరించిందని చెప్పారు. గత నెల రోజులుగా దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని.. ఇది దేశంలోని మొత్తం కేసులలో 55 శాతం అని చెప్పుకొచ్చారు.

    Trending Stories

    Related Stories