ఢిల్లీలోని విజ్ఞాన్భవన్లో 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సం జరిగింది. సినిమా రంగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులకు, ప్రేక్షుల ఆదరణ పొందిన సినిమాలకు భారత వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు అవార్డులు అందజేశారు. తెలుగులో ‘జెర్సీ’, ‘మహర్షి’ సినిమాలకు నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి.
సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు సూపర్స్టార్ రజనీకాంత్కు లభించింది. గత 40 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీ కోసం రజనీ చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్రం.. ఈ విశిష్ట పురస్కారంతో గౌరవించింది. ఇక బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా మలయాళం నుంచి ‘మరక్కర్’ నిలిచింది. ‘మణికర్ణిక’ సినిమాకు కంగనా రనౌత్ ఉత్తమ నటిగా, ‘అసురన్’ సినిమాకు ధనుష్, ‘భోంస్లే’ సినిమాకు మనోజ్బాజ్పాయి ఉత్తమ నటులుగా అవార్డులు అందుకున్నారు. ఒకే సంవత్సరంలో రజనీ, తన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేశారు. ఉత్తమ సహాయ నటుడి ‘సూపర్ డీలక్స్’ మూవీ నుండి విజయ్ సేతుపతి అవార్డు అందుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సంజయ్ పూర్ సింగ్ చౌహాన్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’ అవార్డు లభించగా.. ఉత్తమ ఎడిటింగ్లో ‘జెర్సీ’ మూవీ నుండి నవీన్ నూలి అవార్డు వచ్చింది. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా ‘మహర్షి’కి అవార్డు వచ్చింది.
విజేతల పూర్తి వివరాలు:
ఉత్తమ చిత్రం: మరక్కర్ (మలయాళం)
ఉత్తమ నటి : కంగనా రనౌత్ (మణికర్ణిక)
ఉత్తమ నటుడు: మనోజ్ బాజ్పాయీ (భోంస్లే), ధనుష్ (అసురన్)
ఉత్తమ దర్శకుడు: సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్)
ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ
ఉత్తమ హిందీ చిత్రం: చిచ్చోరే
ఉత్తమ తమిళ చిత్రం: అసురన్
ఉత్తమ ఎడిటింగ్: నవీన్ నూలి (జెర్సీ)
త్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది తాష్కెంట్ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు: విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్)
త్తమ గాయకుడు: బ్రి.ప్రాక్ (కేసరి చిత్రంలోని ‘తేరీ మిట్టీ..’)
ఉత్తమ గాయని: శావని రవీంద్ర (బర్దో-మరాఠీ)
ఉత్తమ కొరియోగ్రాఫర్: రాజు సుందరం (మహర్షి)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): డి. ఇమ్మాన్ (విశ్వాసం)