ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో పేకాట జోరుగా సాగుతోందన్న సమాచారంతో కర్ణాటక పోలీసులు దాడులు నిర్వహించారు. నగరిగేర ప్రాంతంలో 19 మంది రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో హిందూపురం రాజకీయనేతలతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. హిందూపురం వైసీపీ కన్వీనర్ కూడా అరెస్టయ్యారు. అరెస్టయిన వారిని పోలీసులు చిక్కబళ్లాపూర్ కోర్టులో హాజరుపరిచారు.
నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత సహాయకుడు బాలాజీ ని పోలీసులు అరెస్ట్ చేయడం హిందూపురంలో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రా కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని నగరిగేర వద్ద పేకాట ఆడుతూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కర్ణాటక స్పెషల్ టాస్క్పోర్స్ పోలీసులు నిర్వహించిన ఈ దాడుల్లో హిందూపురానికి చెందిన 19 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు హిందూపురం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీరామ్ రెడ్డి, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉన్నట్లు గౌరిబిదనూర్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారి నుంచి లక్షా 50వేల రూపాయలు స్వాధీనం చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కర్ణాటకలోని చిక్బల్లాపూర్ జిల్లా గుడిబండ కోర్టులో పోలీసులు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీలోని కీలక నేతలతో నందమూరి బాలయ్య పీఏ పేకాట ఆడుతూ పట్టుబడటం ఇప్పుడు హిందూపురంలో హాట్టాఫిక్గా మారింది. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి బాలాజీ పీఏగా వ్యవహరిస్తున్నారు. పీఏ బాలాజీ వైఖరి బాలయ్యకు తలనొప్పిగా మారింది. అప్పట్లో పీఏ శేఖర్పై అనేక ఆరోపణలు రావడం, పార్టీ కేడర్ కూడా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే..! ఇప్పుడు మరో సారి పీఏ వార్తల్లోకి నిలవడంతో బాలకృష్ణ ఏ నిర్ణయం తీసుకుంటారా అనే ఉత్కంఠ నెలకొంది.