మునుగోడులో బీజేపీ దూకుడు పెంచింది. గట్టుప్పల్లో గడప గడపకు కమలం నేతలు ప్రచారం చేస్తున్నారు. రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆలోచింపజేసే ప్రశ్నలతో ముందుకు వెళ్తున్నారు. రాజగోపాల్రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండల కేంద్రంగా గుర్తింపు పొందిందని ఆమె గుర్తు చేశారు.