More

    మోదీకి ఆలయం కట్టిన అభిమాని.. వద్దన్న పీఎంవో

    మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్‌ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్థలంలో మోదీకి చిన్న గుడి కట్టిన వార్త దేశ . దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. జైపూర్‌ నుంచి ఎర్రని పాల రాయిని తెప్పించి నిర్మాణానికి వినియోగించారు. తెల్ల పాలరాయితో చేసిన మోదీ విగ్రహాన్ని అందులో ఏర్పాటు చేశారు. భద్రతగా ముందు వైపు గట్టి అద్దాన్ని ఫిక్స్‌ చేశారు. ఆ గుడి ముందు మోదీకి అంకితమిస్తూ ఒక పద్యంతో కూడిన బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆరు నెలల్లో మోదీ గుడి నిర్మాణాన్ని పూర్తి చేశారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదివారం దీనిని ప్రారంభించారు. ప్రధాని అయిన తర్వాత మోదీ చాలా అభివృద్ధి పనులు చేశారని, జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం వంటి వాటి పట్ల విజయవంతంగా వ్యవహరించారని ముండే అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించిన వ్యక్తికి కూడా ఒక మందిరం ఉండాలని తాను భావించానని, అందుకే మోదీకి గుడిని తన సొంత ప్రాంగణంలో నిర్మించినట్లు చెప్పారు.

    మోదీ మీద ఆయన ఇలా అభిమానాన్ని చూపించినా.. కొందరు మాత్రం తప్పుబట్టారు. అంతేకాకుండా ఈ గుడి విషయం మీడియాలో రావడంతో ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించింది. ఇది ఆమోదయోగ్యం కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆలయంలోని మోదీ విగ్రహాన్ని తొలగించారు. ప్రస్తుతం ఈ విగ్రహం స్థానిక బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో ఉంచారు. గురువారం అటుగా వెళ్లిన వ్యక్తులకు ఆ ఆలయంలో మోదీ విగ్రహం కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళింది అని అడగగా అసలు విషయం చెప్పారు.

    Related Stories