మూడు రోజులుగా తప్పిపోయిన ఆర్మీ జవాన్ గురువారం కశ్మీర్ లోయలోని బుద్గామ్ జిల్లాలోని ఓ తోటలో శవమై కనిపించినట్లు అధికారులు తెలిపారు. సమీర్ అహ్మద్ మల్లా సోమవారం ఖాగ్ ప్రాంతంలోని అతని గ్రామం లోకిపోరా నుండి అదృశ్యమయ్యాడు. అతని శరీరంలో బుల్లెట్ గుర్తులు లేవు కానీ ఇతర గాయాల సంకేతాలు కనిపించాయని, ఇది ప్రతీకార హత్యగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ప్రాథమిక పరీక్షలో అతని ముఖంపై రాడ్తో కొట్టినట్లు తెలుస్తోంది. అతడిని హింసించి చంపి, పాతిపెట్టినట్లు తేలింది.
జమ్మూలో పోస్ట్ చేయబడిన 28 ఏళ్ల జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికుడు. రెండో బిడ్డ పుట్టడంతో సెలవుపై ఇంటికి వచ్చారని అధికారులు తెలిపారు. ఫోన్ బ్యాటరీ అయిపోతోందని, ఒకవేళ డిస్కనెక్ట్ అయితే ఫోన్ చేస్తానని చెప్పి తన మొబైల్లోంచి తల్లితో చివరిసారిగా మాట్లాడాడు.
సోమవారం బుద్గామ్లోని లోకిపోరా గ్రామంలోని తన నివాసం నుండి అదృశ్యమైన సమీర్ అహ్మద్ మల్లా మృతదేహాన్ని గురువారం అదే జిల్లాలోని ఖాగ్ ప్రాంతం నుండి స్వాధీనం చేసుకున్నట్లు కశ్మీర్ ఐజిపి తెలిపారు. అతని శరీరంపై గాయం లేదా బుల్లెట్ గుర్తు కనిపించలేదని చెప్పారు. కేసులో దర్యాప్తుకొనసాగుతోంది మరియు అతని మరణానికి దారితీసిన పరిస్థితులను అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నారు. మిలిటెన్సీ కోణం, క్రైమ్ మర్డర్ అనే రెండు కోణాలను పరిశీలిస్తున్నామని ఐజీపీ తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో, దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో తప్పిపోయిన సైనికుడు షకీర్ మంజూర్ వాగే కుళ్ళిపోయిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం మధ్యాహ్నం నుండి జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి చెందిన సమీర్ అహ్మద్ మల్లా కనిపించకుండా పోయాడని, సెల్ఫోన్ స్విచ్ఛాఫ్లో ఉందని పోలీసులు నిర్ధారించారు. జమ్మూలో పోస్టింగ్లో ఉన్న మల్లా తన భార్య రెండో బిడ్డకు జన్మనివ్వడంతో సెలవుపై ఇంటికి వచ్చాడు. ఇంట్లో భోజనం చేశాక.. దాదాపు 1.30 గంటలకు బయటకు వెళ్లిపోయాడు. అప్పటి నుండి అతని గురించి ఎటువంటి సమాచారం లేదు. అతని సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయబడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. గత రెండు రోజులుగా, కుటుంబ సభ్యులు తప్పిపోయిన మల్లా కోసం చుట్టుపక్కల గ్రామాల్లో వెతుకుతున్నారు. అతనిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అతను ఏదైనా తప్పు చేసి ఉంటే, దయచేసి అతన్ని క్షమించి విడుదల చేయండి. మేము అతనితో ఉద్యోగానికి రాజీనామా చేయిస్తామని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల్లో అరుస్తూ తిరిగారు.
ముగ్గురు తీవ్రవాదులు హతం:
దక్షిణ కశ్మీర్, శ్రీనగర్ నగరంలో గురువారం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో అగ్రశ్రేణి TRF/లష్కర్ కమాండర్తో సహా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని J&K పోలీస్ తెలిపారు. IGP విజయ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ, పుల్వామా జిల్లాలోని నైనా బట్పోరా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే ఇన్పుట్ల ఆధారంగా పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయని తెలిపారు. ఈ ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని ఆయన చెప్పారు. “మసీదుకు ఎలాంటి నష్టం జరగకుండా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. ఇద్దరు తీవ్రవాదులను మట్టుబెట్టాము” అని కుమార్ చెప్పారు. ఇద్దరు ఉగ్రవాదులు లష్కరే తోయిబాతో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా పలు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కుమార్ తెలిపారు.
అంతకుముందు రోజు, దర్గా హజ్రార్బల్ వెలుపల జరిగిన ఎన్కౌంటర్లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. మరణించిన ఉగ్రవాదిని టాప్ మిలిటెంట్ కమాండర్ మంజూర్ హైదర్, ‘ఏ కేటగిరీ’ ఉగ్రవాదిగా పోలీసులు గుర్తించారు. ఐజిపి కుమార్ హైదర్ హత్యను పెద్ద విజయంగా అభివర్ణించారు. మంజూర్ అలియాస్ హైదర్ అలియాస్ హంజా, పాకిస్తాన్ జాతీయుడిగా గుర్తించారు, అతను నిషేధిత ఉగ్రవాద సంస్థ LeT/TRFతో అనుబంధంగా ఉన్నాడు. అతను టాప్ LeT/TRF కమాండర్ మెహ్రాన్ సహచరుడు. అతని ఎన్ కౌంటర్ సైన్యానికి పెద్ద విజయని కుమార్ అన్నారు.