హైదరాబాద్ లో మైనర్ అక్కాచెల్లెళ్లపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. నిందితులను అంబర్పేట్ కు చెందిన నవాజ్, ఇంతియాజ్ లుగా గుర్తించారు. ప్రేమ పేరుతో మోసం చేసి రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు బాలికల తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమ పేరుతో నవాజ్, ఇంతియాజ్ లు మైనర్ అక్కా(17) చెల్లెళ్లను(15) మోసం చేశారు. ఈ ఘటన చిలకలగూడ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ చిలకలగూడలో మైనర్ అక్కాచెల్లెళ్లపై అత్యాచారం చేసిన ఘటనలో ఇద్దరు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అంబర్పేట్కు చెందిన ఇంతియాజ్(21), నవాజ్(21) యువకులు ఇద్దరు అక్కాచెల్లెళ్లని ఫేస్బుక్లో పరిచయం చేసుకున్నారు. మొదట స్నేహితులుగా ఉన్న వారు క్రమంగా ఆ యువకుల ప్రేమలో పడ్డారు. వాళ్ల మధ్య సాన్నిత్యం పెంచుకున్నాక అక్కాచెల్లెళ్లు ఆ యువకులతో శారీరకంగా కలిశారు. మైనర్ బాలికల తండ్రికి ఈ విషయం తెలిసి యువకులను పలుమార్లు హెచ్చరించినా వారు వినకపోవడంతో బాధిత తండ్రి తమను పోలీసులను ఆశ్రయించారు.