ఓ వైద్యుడు ఆవు పేడ తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పేడ ప్రాముఖ్యతను వివరిస్తున్న ఆ వైద్యుడి పేరు మనోజ్ మిట్టల్. అతను కర్నాల్ నివాసి. ఎంబీబీఎస్ చదివిన మనోజ్ గత కొన్నేళ్లుగా గోమూత్రం తాగుతూ, పేడ తింటున్నాడు. ఆవు పేడలో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయని.. ఇది రేడియేషన్ నుండి రక్షిస్తుందని మిట్టల్ పేర్కొన్నారు. మొబైల్స్, ఏసీలు, ఫ్రిజ్ మరియు ఇతర ఎలక్ట్రికల్ ఉపకరణాల నుండి రేడియేషన్ వెలువడుతుంది. ఇది క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. అయితే ఆవు పేడ తినడం వల్ల రేడియేషన్ ప్రభావం బాగా తగ్గుతుందని మిట్టల్ తెలిపారు. గర్భిణీ స్త్రీ ప్రసవ సమయంలో ఆవు పేడ తింటే, ప్రసవ సమయంలో ఎక్కువ అసౌకర్యం ఉండదని.. పేడ తినడం వల్ల చాలా రోగాలు నయమవుతాయని మిట్టల్ పేర్కొన్నారు.
మనోజ్ మిట్టల్ శిశువైద్యుడు. కర్నాల్లో పెద్ద ఆసుపత్రిని కలిగి ఉన్నాడు. తాను ఎప్పుడూ నేలపై నిద్రపోతానని.. ఏసీని ఉపయోగించనని మిట్టల్ చెప్పారు. ఆవు పేడలో 28% ఆక్సిజన్ ఉంటుందని.. అందువల్ల తాను ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొన్నారు. మనోజ్ మిట్టల్ వీడియో వైరల్ అయిన వెంటనే, రకరకాల స్పందనలు కనిపిస్తున్నాయి. మనోజ్ వాదన నిజమేనని చాలా మంది చెబుతూ వస్తున్నారు. మిట్టల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆవుపేడ, గోమూత్రంలో ఎన్నో విశిష్టమైన లక్షణాలు ఉన్నాయని ఎప్పుడో తేలిందని.. ఈ డాక్టర్ కూడా పాటిస్తూ ఉన్నారని వీడియోను తెగ షేర్ చేస్తూ ఉన్నారు.