More

    ఏవోబీలో మావోయిస్టుల‌ భారీ డంప్‌ స్వాధీనం

    ఏవోబీలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా క‌టాఫ్ ఏరియాలో భారీ డంప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలో గాలింపు చేస్తున్న బ‌ల‌గాల‌కు డ‌క్‌పొద‌ర్ వ‌ద్ద డంప్ ల‌భ్యమైంది. ఈ డంప్‌లో భారీ ఎత్తున పేలుడు సామాగ్రీ, ఆయుధాలు, మందుపాత‌ర‌లు ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో మూడు తుపాకీలు, వివిధ ర‌కాల‌కు చెందిన 18 మందుపాత‌ర‌లు, గ్రెనైడ్స్, డిటోనేట‌ర్స్ ఉన్నాయి. ఏవోబీలో విధ్వంసాలు చేయ‌డానికి మావోయిస్టులు డంప్‌ను దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

    Trending Stories

    Related Stories