More

    వరదల్లో హోమ్ మినిస్టర్.. కాపాడిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్

    భారీ వర్షాలకు మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి వెళ్లిన ఓ మంత్రి కూడా వరదల్లో చిక్కుకున్నారు. దీంతో ఆయనను కాపాడడానికి భారత ఎయిర్ ఫోర్స్ రావాల్సి వచ్చింది. దాటియా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను నేరుగా కలుసుకునేందుకు హోంమంత్రి నరోత్తం మిశ్రా తన సిబ్బందితో కలిసి వెళ్లారు. అయితే వీరు వెళ్తున్న పడవ మీద చెట్టు విరిగిపడటంతో.. పడవ దెబ్బతింది. ఆ తర్వాత పడవ ఇంజిన్ కూడా స్టార్ట్ కాలేదు. దాంతో మిశ్రా వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. అప్రమత్తమైన అధికారులు భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌తో అక్కడికి వెళ్లారు. అప్పటికే మంత్రి, మరికొందరు సిబ్బంది పూర్తిగా మునిగిన ఇంటి డాబా మీదకు చేరుకున్నారు. మిశ్రాను కనిపెట్టిన ఐఏఎఫ్ సిబ్బంది మిశ్రా సహా ఆయన సిబ్బందిని హెలికాప్టర్ నుంచి తాడును వదిలి పైకి లాగారు. ఆ తాడును పట్టుకుని ఆయన పైకి ఎక్కారు.

    భారీ వర్షాల కారణంగా వరదలతో అల్లాడిపోతున్న దాటియా జిల్లాను సందర్శించే సమయంలో హోంమంత్రి నరోత్తం మిశ్రా చిక్కుకుపోవడంతో భారత వైమానిక దళం యొక్క హెలికాప్టర్ ద్వారా రక్షించబడ్డారు. కొట్రా గ్రామానికి మిశ్రాను తీసుకెళ్తున్న రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) పడవ స్థానిక నివాసితులను తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అకస్మాత్తుగా చెట్టు మీద పడడంతో ఆ పడవ కాస్తా దెబ్బతింది.

    మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా కొన్ని వరద ప్రభావిత ప్రాంతాలను సర్వే చేశారు. వరదల కారణంగా దాటియా జిల్లాలోని రెండు వంతెనలు కూలిపోయాయి. మూడో నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న వంతెన మీద పగుళ్లు ఏర్పడ్డాయి. దాంతో ఆ వంతెనను ముందుజాగ్రత్తగా మూసివేశారు.

    మధ్యప్రదేశ్‌లో గత ఒకటిన్నర రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. 1,250 కి పైగా గ్రామాలు వరద ప్రభావితమయ్యాయని అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ అధికారుల ద్వారా ఇప్పటివరకు 6,000 మందికి పైగా ప్రజలను తరలించినప్పటికీ, ఇంకా 2,000 మంది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు అంచనా వేస్తున్నారు. భారత సైన్యం, ఎస్‌డిఆర్‌ఎఫ్, సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) మరియు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) బృందాలు రెస్క్యూ మరియు సహాయక చర్యలను చేపట్టాయి.

    Trending Stories

    Related Stories