హైదరాబాద్: సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోస్టల్ కవర్ని చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి… పాపన్నగౌడ్ లాంటి మహనీయులను స్మరించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ గడ్డ పౌరుషానికి ప్రతీక సర్దార్ పాపన్నగౌడ్ అని కొనియాడారు. భూస్వాములు, నియంతృత్వానికి వ్యతిరేకంగా బడుగు, బలహీన వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసిన మహాయోధుడు పాపన్నగౌడ్ అని గుర్తు చేశారు. సర్దార్ పాపన్నగౌడ్ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నరసయ్యగౌడ్, తదితరులు హాజరయ్యారు.