కోలీవుడ్ ప్రముఖ నటుడు సూర్యకు అరుదైన గౌరవం దక్కనుంది. 2022 ఆస్కార్ అవార్డుల వేడుకల్లో పాల్గొనాలని సూర్యకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం పొందిన తొలి దక్షిణ భారత నటుడు సూర్య కావడం విశేషం. సూర్యతో పాటు బాలీవుడ్ నటి కాజోల్కు, దర్శకురాలు రీమా కగ్తీకి కూడా ఆస్కార్ అకాడమీ నుండి ఆహ్వానాలు అందాయి.
సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు ఆస్కార్ వరకు వెళ్లి వెనక్కి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సూర్యకు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్ 2022) నుండి ఆహ్వానం వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 397మంది కార్యనిర్వాహకుల జాబితాను అకాడమీ విడుదల చేసింది. అందులో సూర్య పేరు కూడా ఉంది. ఇటీవల ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో నామినేట్ అయిన ‘రైటింగ్ విత్ ఫైర్’ నిర్మాతలు రింటు థామస్, సుస్మితా ఘోష్లకు కూడా హాజరుకాబోతున్నారు.