నెల్లూరు నగరంలోని పలు బంగారు నగల దుకాణాలపై ఐటీ అధికారులు మెరుపు దాడులు చేశారు. స్థానిక మండపాల వీధిలోని బంగారు దుఖాణాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ, గుంటూరు నుంచి వచ్చిన 40మంది అధికారులు ఈ దాడులలో పాల్గొన్నారు. ఏకకాలంలో 15 ప్రాంతాల్లో 40మంది ఐటీ, కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.