భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభించింది. పీఎస్ఎల్వీసీ-54 ఉపగ్రహ వాహకనౌక శనివారం ఉదయం 11.56 గంటలకు ఎర్త్ అబ్ఙర్వేషన్ శాటిలైట్ EOS-06తో పాటు మరో 8 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబందించి శ్రీహరికోటలోని సతీష్ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో గురువారం రాకెట్ సన్నధ్దత.. లాంచ్ అథరైఙేషన్ బోర్డు సమావేశాలు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 10.56 గంటలకు కౌంట్డౌన్ మొదలైంది. రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియ చేపట్టారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్లో 56వ ప్రయోగం. అలాగే ఈ ఏడాది ఇస్రో చేపట్టననున్న ఆఖరి ప్రయోగం ఇదే. పీఎస్ఎల్వీ రాకెట్కు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్డౌన్ను స్వయంగా పర్యవేక్షిస్తారు.