మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 పరీక్షను భారత్ బుధవారం విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. సాధారణ శిక్షణ ప్రయోగాల్లో భాగంగా వ్యూహాత్యక దళాల కమాండ్ దీన్ని చేపట్టాయని అధికారిక ప్రకటన పేర్కొంది. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణి 3,500 నుంచి 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.
ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి బుధవారం ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి అగ్ని-3 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. సాధారణ శిక్షణలో భాగంగా సైనిక దళాల్లోని వ్యూహాత్మక కమాండ్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. క్షిపణికి సంబంధించి అన్ని అంశాలు, విశ్వసనీయతను ఈ పరీక్ష ధ్రువీకరించిందని అధికారులు చెప్పారు. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణికి 3,500 కి.మీ. – 5,000 కి.మీ. పరిధి ఉంది. పొరుగు దేశాల సరిహద్దుల నుండి బాగా దూరంలో గల లక్ష్యాలను ఇది ఛేదించగలదు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అభివృద్ధి చేసిన అగ్ని-3, అణ్వస్త్రాలను ప్రయోగించే సామర్థ్యం కలిగిన రెండు దశల బాలిస్టిక్ క్షిపణి. దీన్ని డీఆర్డీవోకు చెందిన అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీలో అగ్ని-3 ని రూపొందించి, అభివృద్ధి చేశారు.