More

    మొదటి టీ20లో విజయాన్ని అందుకున్న భారత్

    మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులతో రాణించారు. సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాక.. భారత్ ఫినిషింగ్ చేయడంలో కాస్త తడబడింది. చివర్లో కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రేయాస్ అయ్యర్ (5), వెంకటేశ్ అయ్యర్ (4) వెంటవెంటనే అవుట్ కావడంతో మైదానంలో కాస్త టెన్షన్ కనిపించింది. అయితే తడబడుతూ ఆడుతూ వచ్చిన రిషభ్ పంత్ (17) చివరి ఓవర్ లో ఫోర్ కొట్టి పంత్ భారత్‌కు విజయాన్ని అందించాడు. కివీస్ బౌలర్లలో బౌల్ట్‌ 2 వికెట్లు తీసుకోగా, సౌథీ, శాంట్నర్, మిచెల్ చెరో వికెట్ తీసుకున్నారు.

    టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 42 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. చాప్‌మన్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేయడంతో కివీస్ భారీ స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీసుకోగా, దీపక్ చాహర్, సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజలో నిలిచింది. రెండో టీ20 శుక్రవారం రాంచీలో జరగనుంది.

    Trending Stories

    Related Stories