గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను విడుదల చేయాలంటూ హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నాచౌక్ లో హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. ధర్నాచౌక్ కు పెద్ద ఎత్తున తరలివచ్చిన హిందు సంఘాలు తెలంగాణ సర్కార్ వైఖరిపై ఆవేదన వ్యక్తం చేశాయి. నిజనిజాలను తెలుసుకోకుండా పీడీ యాక్ట్ పెట్టి ఎమ్మెల్యే రాజసింగ్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు.