చాగంటిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు: సోము వీర్రాజు

0
663

ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ప్రకటించడంపై కొందరు విమర్శలు చేస్తున్నారు. నవంబరు 30న నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా చాగంటి కోటేశ్వరరావుకు అవార్డు ప్రదానం చేయాలని నిర్వాహకులు భావించారు. చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారాన్ని ప్రకటించడంపై కవులు, రచయితలు, కళాకారులు విజయనగరంలోని గురజాడ నివాసం నుండి నిరసన ర్యాలీకి వచ్చారు.

ఈ వివాదంపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. తన దృష్టిలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏ అవార్డుకైనా అర్హులేనని తెలిపారు. గురజాడ అవార్డు ఎవరికి ఇవ్వాలనే విషయం ఆ అవార్డు అందించే వ్యక్తులు, సంస్థల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుందని అని అన్నారు. చాగంటి గారు అద్భుతమైన జ్ఞాన భాండాగారం అని.. రోడ్లపై ధర్నాలు చేస్తూ చాగంటి గారి పేరు ఉచ్చరించే అర్హత ఎవరికీ లేదని సోము వీర్రాజు విమర్శించారు. అవార్డుల పేరుతో ఆయన కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రతి సంవత్సరం గురజాడ పురస్కారాన్ని అందిస్తుంటారు. ఈ ఏడాది గురజాడ పురస్కారాన్ని చాగంటి కోటేశ్వరరావుకు ప్రకటించారు.