More

    బంగ్లా జాతి పితకు గాంధీ శాంతి బహుమతి ప్రకటించిన కేంద్రం.. MODI బంగ్లా పర్యటన నేపథ్యంలో ప్రాధాన్యత

    2019కిగానూ ఒమ‌న్ రాజు దివంగ‌త సుల్తాన్ ఖాబూస్ బిన్ సాయిద్ అల్ స‌యిద్‌ను గాంధీ శాంతి పుర‌స్కారానికి ఎంపిక చేశారు. ఇక 2020 సంవ‌త్స‌రానికి గాంధీ శాంతి బహుమతి బంగ్లాదేశ్ జాతిపిత, బంగ‌బంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్‌కు దక్కింది.

    గాంధీ శాంతి బహుమతి. మహాత్మా గాంధీ 125 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని స్థాపించిన ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ 1995 నుంచి భార‌త ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న‌ది. అహింస, శాంతి స్థాపనకు కృషి, సామాజిక.. ఆర్థిక, రాజకీయ పరివర్తనకు తోడ్పడే వ్యక్తులకు భారత ప్రభుత్వం అందజేసే ‘గాంధీ శాంతి బహుమతి’ని కేంద్ర సాంస్కృతిక శాఖ  ఆధ్వర్యంలో అందజేయడం జరుగుతుంది. 2018లో జపాన్ కు చెందిన యోవి ససకవాకు ఈ పురస్కారం దక్కింది. కుష్టువ్యాధి నిర్మూలన కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా గాంధీ శాంతి అవార్డు లభించింది. తదనంతరం వచ్చిన కోవిడ్ పాండమిక్ పరిస్థితులు దృష్ట్యా 2019, 2020 లకు సంబంధించిన పురస్కారాల అనౌంన్స్ మెంట్స్ వాయిదా పడ్డాయి. దీంతో 2019, 2020 ఏడాదికిగానూ ఒకేసారి ఇద్దరికి అవార్డులను ప్రకటించారు. 2019కిగానూ ఒమ‌న్ రాజు దివంగ‌త సుల్తాన్ ఖాబూస్ బిన్ సాయిద్ అల్ స‌యిద్‌ను గాంధీ శాంతి పుర‌స్కారానికి ఎంపిక చేశారు. ఇక 2020 సంవ‌త్స‌రానికి గాంధీ శాంతి బహుమతి బంగ్లాదేశ్ జాతిపిత, బంగ‌బంధు షేక్ ముజీబుర్ రెహ్మాన్‌కు దక్కింది.

    ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఈ అవార్డు విజేత‌ల‌ను ఎంపిక చేసింది. ఈ క‌మిటీలో ఇద్ద‌రు ఎక్స్ ఆఫీషియో స‌భ్యులు కూడా ఉన్నారు. దాంట్లో చీఫ్ జ‌స్టిస్‌తో పాటు లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నేత ఉంటారు. జ్యూరీలో ఇద్ద‌రు ప్ర‌ముఖులు కూడా ఉంటారు. వారిలో ఒక‌రు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లా, సుల‌భ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫౌండ‌ర్ బిందేశ్వ‌ర్ పాఠ‌క్‌లు ఉన్నారు. మార్చి 19, 2021వ తేదీన జ్యూరీ సమావేశమై, సంప్ర‌దింపుల త‌ర్వాత అవార్డు విజేత‌ల‌ను ఎంప‌కి చేశారు. విజేత‌ల‌కు కోటి రూపాయ‌ల న‌గ‌దుతో పాటుగా.. ఓ ప్ర‌శంసా ప‌త్రం, చేనేత వ‌స్తువుల‌ను అంద‌జేస్తారు.

    కాగా, బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26, 27 తేదీల్లో ఆ దేశంలో పర్యటించనున్నారు. మోదీ పర్యటనకు నాలుగు రోజుల ముందే బంగ్లా జాతిపితకు భారత్ అందించే ప్రతిష్టాత్మక గాంధీ శాంతి అవార్డు దక్కడం గమనార్హం. మాన‌వ హ‌క్కుల స్థాప‌న‌లో బంగ‌బంధు షేక్ ముజీబుర్ రెహ్మన్ కృషి గొప్పదని, ఆయ‌న ఇండియ‌న్ల‌కు కూడా హీరో అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇక 2019 గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన ఒమ‌న్ మాజీ పాలకుడు దివంగత సుల్తాన్ ఖాబూస్ ఓ విజిన‌రీ నేతగా, అంత‌ర్జాతీయ స‌మ‌స్‌మల ప‌రిష్కారంలో కీల‌క పాత్రధారిగా వ్యవహరించారు. భార‌త్‌ ఆయిల్ అవసరాలను తీర్చగలిగేలా ఒమ‌న్ సహా గల్ఫ్ దేశాలతో బంధాన్ని బలోపేతం చేసిన కీల‌క వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇండియాలోనే చ‌దువుకున్న ఆయ‌న‌.. ఇండియాతో మంచి స్నేహాన్ని కొనసాగించారు. ఇరు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య నిర్మాణంలో సుల్తాన్ ఖాబూస్ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ప్‌దధాని మోదీ గ‌తంలో తెలిపిన విషయం మనకు తెలిసిందే.

    Trending Stories

    Related Stories